బీజేపీ ఆధ్వర్యంలో ఎండిన పంటల పరిశీలన 

బీజేపీ ఆధ్వర్యంలో ఎండిన పంటల పరిశీలన 


ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి మండలం హాన్మపురం గ్రామంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎండిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు.  ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్  పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం మన రాష్ట్రంలో అమలు చేసి ఉంటే  రైతులకు ఆసరాగా నిలిచేదన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం అయినా పసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్ట పోయిన రైతు లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల శాఖ అద్యక్షులు చీర్క సురేశ్ రెడ్డి, కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యేనం శివ కుమార్, కిసాన్ మోర్చజిల్లా అధ్యక్షులు పకిర్ రాజేందర్ రెడ్డి,ఉపాధ్యక్షులు జెనాపెళ్లి శ్యామ్ సుందర్ రెడ్డి, పట్నం శ్రీనివాస్, బీజేపీ భువనగిరి మండల ప్రధాన కార్యదర్శి నాగు వినోద్ కుమార్, నాయకులు రత్నపురం బలరాం, కాసాని శ్రీనివాస్, వడ్డబోయిన వెంకటేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పడమటి మాణిక్యం రెడ్డి, కొత్తపెళ్లి చంద్రశేఖర్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు మణికంఠ గౌడ్, బిజెపి మండల ఉపాధ్యక్షులు తోటకూరి వెంకటేష్, రామ, రైతులు సాధినేని ఉపేందర్, నాయని చంద్రయ్య, ఆంజనేయులు, యాస మోహన్ రెడ్డి, పాల సత్తిరెడ్డి, తుమ్మేటి కొండల్,గజ్జి నాగరాజు పాల్గొన్నారు